పార్టీలో నిర్లక్ష్యం, కావూరికి అన్యాయం: హర్షకుమార్

కేంద్రమంత్రి మండలి విస్తరణపై గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు కూడా తన అసంతృప్తిని గుంటూరు జిల్లాలో వ్యక్తం చేశారు. మంత్రి వర్గ విస్తరణలో సీనియర్లకు అన్యాయం జరిగిందన్నారు. తన తమ్ముడు, నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని రాయపాటి చెప్పారు.
కాగా శనివారమే కావూరి సాంబశివ రావు అలకబూనిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోకసభ స్థానం నుంచి రెండు సార్లు, మచిలీపట్నం నుంచి మూడు కావూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. కావూరి నిన్న తన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. పార్టీలో ప్రాధాన్యత ఉన్న పదవిని అప్పగిస్తామని తెలిపింది. ఆయన రాజీనామా చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications