వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కొడుకు శిక్షార్హుడే, భారత్‌లోనే: శాన్వి హంతకుడి తల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghunandan's mom weeps
గుంటూరు: చిన్నారి శాన్వి హత్యకు దారితీసిన కారణాలను వెలికి తీయాలని నిందితుడు రఘునందన్ తల్లి ఆదివారం విజ్ఞప్తి చేసింది. ఇటీవల అమెరికాలో అపహరణకు గురైన పది నెలల చిన్నారి శాన్విని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెను రఘు చంపినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. దీనిపై రఘు తల్లి స్పందించారు. తన తనయుడు రఘు తప్పు చేశాడు కాబట్టి శిక్షను అనుభవించాల్సిందేనని ఆమె రోదిస్తూ తెలిపింది.

అయితే హత్యకు దారి తీసిన కారణాలను కూడా వెలికి తీయాలని ఆమె కోరింది. రఘునందన్‌ది మొదటి నుండి నేరపూరిత స్వభావం కాదని, నలుగురికి సహాయం చేసే గుణం అని చెప్పారు. ఎవరికీ ప్రాణహానీ చేసే వాడు కాదన్నారు. అయితే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాల్సిందేనని, ఆ శిక్షను మన భారత దేశంలోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శాన్విని తన తనయుడు హత్య చేసినందుకు ఆ కుటుంబానికి ఆమె క్షమాపణలు చెప్పారు.

రఘు తనతో వారం రోజులుగా మాట్లాడటం లేదని, ఒక్కసారి అతనితో మాట్లాడించాలని ఆమె రోదించారు. తన తనయుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు. కాగా చిన్నారి శాన్విని కిడ్నాప్ చేసి, చంపేసిన రఘును ఎఫ్‌బిఐ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. శాన్వి తండ్రిని అందరూ వెంకట్ అని పిలుస్తారు. కొందరు మాత్రమే శివ అంటారు. ఈ ఆధారంగానే పోలీసులు నిందితుడు రఘునందన్‌ను గుర్తించారు.

English summary

 Raghunandan mummy wept for his son's attitude. She said he must punished for his murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X