బాబుతో పోలిక లేదు: షర్మిల యాత్రలో లక్ష్మీ పార్వతి
చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించారని, ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పదవికి అర్హుడు కాదని, ఆయన కాంగ్రెసు పార్టీకి ఏజెంట్ అని విమర్శించారు.
రాష్ట్రానికి వస్తున్నా మీకోసం అంటున్న చంద్రబాబు నాయుడు గానీ, ఇందిర బాట అంటున్న కిరణ్ కుమార్ రెడ్డి గానీ అవసరం లేదన్నారు. షర్మిల అనంతపురం జిల్లాలో 16వ రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆమె పాదయాత్రలో లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు.
కాగా అంతకుముందు షర్మిల ప్రజా ప్రస్థానం బంబంస్వామి గుట్ట నుండి ప్రారంభమైంది. షర్మిల వెంట లక్ష్మీపార్వతితో పాటు శోభా నాగి రెడ్డి, రోజా, కాపు రామచంద్రా రెడ్డి, గుర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తారు.