వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బాధ మాకు తెల్సు: షర్మిల సంతాపం, కవిత నివాళి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavitha - Sharmila
అనంతపురం/శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం సంతాపం తెలియజేశారు. కుటుంబ పెద్దను కోల్పోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసునన్నారు. స్వయంగా తాము ఆ బాధను అనుభవిస్తున్నామని, ఎర్రన్నాయుడి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆమె తెలిపారు.

ప్రాంతాలకతీతంగా.. కల్వకుంట్ల కవిత

ఎర్రన్నాయుడు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూతురు పెళ్లికి వచ్చిన ఆమె శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ఎర్రన్నాయుడి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రన్నాయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పిసిసి చీఫ్ బొత్స కుమార్తె పెళ్లికి హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డిలు తమ సంతాపాన్ని తెలిపారు. వివాహం తర్వాత భౌతికకాయం సందర్శించనున్నట్లు వారు తెలిపారు.

English summary
Telugudesam Party senior leader Kinjarapu Errannaidu died in road accident on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X