ఆ బాధ మాకు తెల్సు: షర్మిల సంతాపం, కవిత నివాళి
ప్రాంతాలకతీతంగా.. కల్వకుంట్ల కవిత
ఎర్రన్నాయుడు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూతురు పెళ్లికి వచ్చిన ఆమె శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఎర్రన్నాయుడి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రన్నాయుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పిసిసి చీఫ్ బొత్స కుమార్తె పెళ్లికి హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డిలు తమ సంతాపాన్ని తెలిపారు. వివాహం తర్వాత భౌతికకాయం సందర్శించనున్నట్లు వారు తెలిపారు.