చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవనంపై నుంచి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Software Engineer jumps to death from office building
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబారంలో తన కార్యాలయ భవనంపై నుంచి దూకి మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో జరిగింది. కార్యాలయంలో పని ముగించి, ఇంటికి వెళ్లే సమయంలో ఆర్ నళిని అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

మద్రాసు ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్‌లోని కార్యాలయం భవనంపై నుంచి దూకి నళిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. తన భర్త రామ్ కుమార్‌తో కలిసి నళిని తాంబారం సమీపంలోని పుజితివాక్కంలో నివాసం ఉంటోంది. రామ్ కుమార్ టి. నగర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.

నళిని భవనంపై నుంచి దూకిన విషయాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. ఆ భవనంలో పలు సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు. తాంబారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

నళిని ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, విచారణ నిమిత్తం ఆమె భర్తను పిలిచామని పోలీసులు చెప్పారు. ఇటీవల హైదరాబాదులో నీలిమ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కార్యాలయ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర వివాదం సృష్టించిన విషయం తెలిసిందే.

English summary
A 36-year-old software engineer committed suicide by jumping off the sixth floor of her office in Tambaram on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X