ఇద్దరు మంత్రుల కొడుకులపై యువజన కాంగ్రెస్ వేటు

శ్రీమాన్, సాయి శంకర్లను సమావేశాలకు సరిగా హాజరు కాకపోవడం, కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం తదితర కారణాలతో బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ వారి చర్యలపై సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు. శ్రీమాన్ వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానానికి, సాయి శంకర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి యూత్ కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
వీరు గత జూలైలో ఎన్నికయ్యారు. నాలుగు నెలలుగా వారు శిక్షణా కార్యక్రమాలకు, మెంబర్ షిప్ కార్యక్రమాలకు, ప్రభుత్వం కార్యక్రమాల అవగాహన కార్యక్రమాలకు, రివ్యూ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లిజ్జు నోటీసులకు కూడా వారు స్పందించలేదని అందుకే బహిష్కరించినట్లుగా చెప్పారు.
అయితే.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను వ్యక్తిగతంగా కలిస్తేనే యువజన కాంగ్రెస్కు సేవలు అందిస్తున్నట్లుగా.. స్వతంత్రంగా వ్యవహరిస్తే నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారని సస్పెన్షన్కు గురైన వారి వర్గం ఆరోపిస్తోంది.
గతంలో ఆయన పార్టీని వీడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన సంగతిని ఎవరూ విస్మరించలేదని, రిలయన్స్పై దాడుల వ్యవహారాన్ని ఎవరూ మరిచిపోలేదని దీనిని యువజన కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని వారంటున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications