ఇద్దరు మంత్రుల కొడుకులపై యువజన కాంగ్రెస్ వేటు

Balaram Naik-Baswaraj Saraih
వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తనయులపై వేటు పడింది. మంత్రుల తనయులను యూత్ కాంగ్రెసు నుంచి బహిష్కరించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తనయుడు బస్వరాజు శ్రీమాన్, కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ తనయుడు పోరిక సాయి శంకర్‌లను యువజన కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ లిజ్జు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీమాన్, సాయి శంకర్‌లను సమావేశాలకు సరిగా హాజరు కాకపోవడం, కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం తదితర కారణాలతో బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ వారి చర్యలపై సరైన సమాధానం రాలేదని చెబుతున్నారు. శ్రీమాన్ వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానానికి, సాయి శంకర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి యూత్ కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

వీరు గత జూలైలో ఎన్నికయ్యారు. నాలుగు నెలలుగా వారు శిక్షణా కార్యక్రమాలకు, మెంబర్ షిప్ కార్యక్రమాలకు, ప్రభుత్వం కార్యక్రమాల అవగాహన కార్యక్రమాలకు, రివ్యూ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లిజ్జు నోటీసులకు కూడా వారు స్పందించలేదని అందుకే బహిష్కరించినట్లుగా చెప్పారు.

అయితే.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను వ్యక్తిగతంగా కలిస్తేనే యువజన కాంగ్రెస్‌కు సేవలు అందిస్తున్నట్లుగా.. స్వతంత్రంగా వ్యవహరిస్తే నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారని సస్పెన్షన్‌కు గురైన వారి వర్గం ఆరోపిస్తోంది.

గతంలో ఆయన పార్టీని వీడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన సంగతిని ఎవరూ విస్మరించలేదని, రిలయన్స్‌పై దాడుల వ్యవహారాన్ని ఎవరూ మరిచిపోలేదని దీనిని యువజన కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని వారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+