తెరాస తిరకాసు పార్టీ, వైయస్ అల్లుడికి...: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాదయాత్ర శనివారం కరీంనగర్ జిల్లాలో కొనసాగింది. తెరాసను ఆయన తిరకాసు పార్టీగా అభివర్ణించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆయన ఆరోపణలు చేశారు. తన అల్లుడికి వైయస్ రాజశేఖర రెడ్డి 1.46 లక్షల ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.

తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులో కూడా మాట్లాడబోనని ఆయన అన్నారు. అయితే, కొన్ని పార్టీలు తామ పార్టీని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాజకీయాలను స్వార్థానికి వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.

పతి రైతుల సమస్యలను ప్రభుత్వం వారం రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే జమ్మికుంటలో తాను మహాధర్నా చేపడతానని ఆయన హెచ్చరించారు. పత్తికి మద్దతు ధర రూ. 4 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేసి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు.

ముస్లిం తాము వచ్చే ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని ఆయన చెప్పారు. రైతుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన తీరును గుర్తుకు తెస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+