వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైం అడిగిన సిబిఐ: జగన్ బెయిల్ విచారణ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయ సాయి రెడ్డి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) ఎదుట సోమవారం హాజరయ్యారు. ఈడి న్యాయ ప్రాధికార సంస్థ అధికారులు విజయ సాయి రెడ్డిని విచారించారు.

జగన్ ఆస్తుల జఫ్తుపై విచారణ 26కు

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడి జఫ్తు కేసు విచారణను పిఎంఎల్ అథారిడి ఈ నెల 26కు వాయిదా వేసింది. ఆ లోగా ఈడి జఫ్తు చేసిన ఆస్తులపై కౌంటర్ దాఖలు చేయాలని జగతి పబ్లికేషన్, జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నెల 19వ తేదికి వాయిదా వేసింది. జగన్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో స్టాట్యూటరీ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లకు దరఖాస్తు చేసుకోగా అక్కడ చుక్కెదురు కావడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

గాలి శ్రీనివాస్ రెడ్డి

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నాడు.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy's bail petition judgement postponed to December 19th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X