హంతుకులే సంతాపాలు: కాంగ్రెసు నివాళిపై కెటిఆర్

పిసిసి రాష్ట్ర స్థాయి సమావేశంలో తెలంగాణ కాంగ్రెసు నేతలు నివాళి కోసం కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన అడిగారు. అలాంటి పార్టీలో కొనసాగాల్సిన పరిస్థితి తెలంగాణ నేతలకు ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రెండో తరగతి పౌరులుగా సీమాంధ్రుల కింద గులాంగిరీ చేస్తున్నందుకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హంతకులే సంతాపాలు ప్రకటిస్తే అమరుల ఆత్మ క్షోభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే తప్ప కాంగ్రెసును, ఆ పార్టీ నాయకులను ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు.
ఆదివారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పొన్నం ప్రభాకర్ నీలం తుఫాను మృతులకు, తెలంగాణ అమర వీరులకు నిలబడి నివాళులు అర్పించాలని చేసిన డిమాండ్ తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గొడవను చల్లార్చడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని సూచించడంతో సభ నివాళులు అర్పించింది. ఈ తీరుపై కెటిఆర్ సోమవారం మండిపడ్డారు.












Click it and Unblock the Notifications