ఎగ్జిట్ పోల్ సర్వేలు: ముచ్చటగా మూడోసారీ మోడీదే

తుది విడత రెండో దశ పోలింగ్ గుజరాత్లో సోమవారం ముగిసింది. రెండో దశలో 60 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 95 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండు దశల్లోనూ భారీ పోలింగు నమోదైంది. గుజరాత్ శాసనసభలో మొత్తం 182 శాసనసభా స్థానాలున్నాయి. సి - వోటర్ బిజెపికి 124 స్థానాలు లభిస్తాయని అంచనా వేస్తుండగా చాణక్య 140 స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. అయితే, ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు 120 నుంచి 124 స్థానాలు రావచ్చునని అంచనా వేస్తున్నాయి.
బిజెపికి 124 స్థానాలు వచ్చే అవకాశాలున్నట్లు చెబుతోంది. టౌమ్స్ నౌ అంచనా 120 సీట్లు. నీల్సన్ సర్వే 124 స్థానాలు బిజెపికి దక్కుతాయని అంచనా వేసింది. ఎన్డీటివి 120 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బిజెపిని ధిక్కరించి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న కేశూభాయ్ పటేల్కు తీవ్ర నిరాశ ఎదురవుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఆయనకు ఒకటి లేదా రెండు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నాయి.
కాంగ్రెసుకు 50 నుంచి 53 స్థానాలు దక్కే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. కాగా, 41 శాతం మంది నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. మొత్తం మీద, అభివృద్ధి మంత్రంతో నరేంద్ర మోడీ మూడోసారి గుజరాత్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో బిజెపి నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు మరింతగా ముందుకు రావచ్చు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా?












Click it and Unblock the Notifications