బయటకొచ్చేది లేదంటే మాట్లాడరేం?: తెలంగాణపై బాబు

Chandrababu Naidu
కరీంనగర్: తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడబోనని, తెలంగాణపై కేంద్రం వెంటనే తేల్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. కరీంనగర్ జిల్లాలో బాబు పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై పరిష్కరించాకే అఖిల పక్ష సమావేశం నుండి బయటకు వద్దామంటే కేంద్రం, కాంగ్రెసు స్పందించడం లేదన్నారు.

తెలంగాణపై నేనిచ్చిన లేఖ కేంద్రప్రభుత్వం వద్దే ఉందని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని, దీన్ని రాజకీయం చేయొద్దన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని, తెలుగుదేశంపై బురదజల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. మమ్మల్ని దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారన్నారు. 2008లోనే తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామన్నారు. ఇక్కడ తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్య తేల్చడం లేదన్నారు. పనికిమాలిన ముఖ్యమంత్రి ఎక్కడా కనపడడని.. పత్తి, పసుపు, వరి, చెరుకు రైతులు మద్దతు ధరలు లభించక ఇబ్బందులు పడుతుంటే విశాఖకు వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెరాస కిరికిరి పార్టీ అని, అది వాస్తవాలు చెప్పదని, రాజకీయ లబ్ధి గురించే ఆలోచిస్తుందని విమర్శించారు. అతి త్వరలోనే ఉద్యోగుల కోసం ఒక పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+