మాలో ఏకాభిప్రాయంలేదు: గాదె, షిండే వ్యాఖ్యపై సవాల్

అలా చెప్పినట్లు ఎవరైనా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను ఎప్పుడూ సమైక్యగళమే విప్పుతున్నానన్నారు. అఖిల పక్షంలోనూ సమైక్యవాదం వినిపించానన్నారు. తమ పార్టీకి చెందిన నేత సురేష్ రెడ్డి తెలంగాణవాదం వినిపించారన్నారు. తెలంగాణపై తమ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు. తాను గతంలో అదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు.
తాను సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. పార్టీలో ఒకే అభిప్రాయం ఉండేందుకు మాతి ఉప ప్రాంతీయ పార్టీ కాదన్నారు. తెలుగుదేశం, సిపిఐలది తెలంగాణపై రాజకీయ అవకాశవాదమని విమర్శించారు. అఖిల పక్షంలో విభజన మంచిది కాదన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యాఖ్యలను తాను ఉటంకించానని చెప్పారు.
కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతాయన్నారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని గాదె వెంకట రెడ్డి అన్నారు.
రాజీనామాలు అవసరం లేదు
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రాన్ని కేంద్రం విడగొట్టదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం రాదన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications