మాలో ఏకాభిప్రాయంలేదు: గాదె, షిండే వ్యాఖ్యపై సవాల్

అలా చెప్పినట్లు ఎవరైనా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను ఎప్పుడూ సమైక్యగళమే విప్పుతున్నానన్నారు. అఖిల పక్షంలోనూ సమైక్యవాదం వినిపించానన్నారు. తమ పార్టీకి చెందిన నేత సురేష్ రెడ్డి తెలంగాణవాదం వినిపించారన్నారు. తెలంగాణపై తమ పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నారు. తాను గతంలో అదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు.
తాను సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. పార్టీలో ఒకే అభిప్రాయం ఉండేందుకు మాతి ఉప ప్రాంతీయ పార్టీ కాదన్నారు. తెలుగుదేశం, సిపిఐలది తెలంగాణపై రాజకీయ అవకాశవాదమని విమర్శించారు. అఖిల పక్షంలో విభజన మంచిది కాదన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యాఖ్యలను తాను ఉటంకించానని చెప్పారు.
కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు జరుగుతాయన్నారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని గాదె వెంకట రెడ్డి అన్నారు.
రాజీనామాలు అవసరం లేదు
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రాన్ని కేంద్రం విడగొట్టదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం రాదన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications