హత్యాయత్నకుట్ర: పరిటాల శ్రీరామ్పై కేస్, ఇరికించారు: సునీత

ధర్మవరంకు చెందిన కాంగ్రెసు పార్టీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి పైన హత్యాయత్నం కుట్ర జరిగింది. దీనిని పోలీసులు చేధించారు. ఈ కుట్ర కేసుకు సంబంధించి శ్రీరామ్ సహా పది మందిపై కేసు నమోదయింది. ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. నాగూర్ హుస్సేన్ అనే వ్యక్తి ఆయుధాలు సరఫరా చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. అతనిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. నిందుతుల సమాచారం మేరకు పరిటాల శ్రీరామ్, అతని డ్రైవర్ రాముపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
కాగా పరిటాల రవీంద్ర - పరిటాల సునీతల తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ ఇటీవల రాజకీయాల్లోకి రానున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అతనిని 2014 ఎన్నికల్లో పోటీకి దింపేందుకు తల్లి, రాప్తాడు టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇరికించారు
తనను రాజకీయంగా ఎదుర్కోలేక తన కుమారుడు పరిటాల శ్రీరామ్ను కేసులో ఇరికించారని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను ఫ్యాక్షన్కు దూరంగా పెంచానన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే శ్రీరామ్ను ఇరికించారన్నారు. ఉన్నత విద్య కోసం జనవరిలో విదేశాలకు వెళుతున్న సమయంలో ఇలా చేశారని ఆమె ఆరోపించారు. విచారణ జరిగేతే నిజాలు బయటకొస్తాయన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications