వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్య కుట్ర, 51కోట్లు స్వాధీనం: జగన్ అటాచ్‌పై ఈడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంటుకు సంబంధించి ఈ రోజు ఈడి(ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) న్యాయప్రాధికారిక సంస్థ ముందు ఈడి మంగళవారం తన వాదనలను వినిపించింది. హెటెరో, ట్రైడెంట్, అరబిందో, ఎబిఎల్, జనని, జగతిలు కూడా తమ వాదనలను వినిపించాయి. వాదనలు పూర్తయన అనంతరం న్యాయప్రాధికారిక సంస్థ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

సిబిఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జీషీటు ఆధారంగా ఆస్తుల అటాచ్‌ను చేశామని ఈడి వాదించింది. జనని, జగతిలకు ఫార్మా కంపెనీల నుండి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ కుట్ర అంతా రహస్యంగా జరిగిందని తెలిపింది. ఆస్తుల అటాచ్ ప్రాథమిక చర్య మాత్రమేనని తెలిపింది. అయితే నేరారోపణకు మించి ఆస్తులు అటాచ్ ఎలా చేస్తారని జగన్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. ఈడి, హెటిరో, అరబిందో, ట్రైడెంట్ వంటి కంపెనీలు 21.5 కోట్ల లబ్ధిని పొందాయని, ప్రతిగా జనని, జగతిలో 29.5 కోట్లు పెట్టుబడులు పెట్టాయని ఈడి బలమైన వాదన వినిపించింది.

ఐదు కంపెనీలకు సంబంధించి తాము రూ.51 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పూర్తిగా క్విడ్ ప్రోకో లావాదేవీలని విచారణలో తేలిందన్నారు. మరికొన్ని ఆస్తులను జప్తు చేయాల్సి ఉందని చెప్పారు. వాదనలు గంటన్నర పాటు సాగాయి. ఈడి, హెటెరో, ట్రైడెంట్, అరబిందో, ఎబిఎల్, జనని, జగతిలు వాదనలు వినిపించాయి. అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

English summary
ED argues that they were attached Rs.51 crore in YSR Congress party chief YS Jaganmohan Reddy's DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X