నాకు ఆశ్చర్యం కలగలేదు, 63 ఏళ్ల యోధుడు: లోకేష్

తన తండ్రి 63 ఏళ్ల వయస్సులో 1,500 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం పట్ల కొందరు ఆశ్చర్యపోయారని, కానీ తనకు మాత్రం ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నారు. ప్రజల పట్ల తన తండ్రి నిబద్దత, చిత్తశుద్ది ఈ పాదయాత్ర తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. అరవై మూడేళ్ల వయస్సులో ప్రజల కోసం పరితపిస్తున్న పోరాట యోధుడి(చంద్రబాబు)కి సెల్యూట్ చేయాలన్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రికార్డ్ పాదయాత్రను అధిగమించిన విషయం తెలిసిందే. దివంగత వైయస్ 2003లో 1468 కిలోమీటర్లు నడిచారు. చంద్రబాబు దానిని అధిగమించారు. గురువారం నాటికి ఆయన 1500 కిలోమీటర్లు పూర్తి చేశారు.
వైయస్ పాదయాత్ర 33 నియోజకవర్గాల్లో కొనసాగగా.. బాబు యాత్ర 40 నియోజకవర్గాలు పూర్తి చేసుకుంది. ఇంకా కొనసాగుతోంది. 1500 కిలోమీటర్లు దాటినందున సంగెం మండలం పల్లారుగూడ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు పాదయాత్ర పైన అప్పుడప్పుడు లోకేష్ ట్విట్టర్లో కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications