హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్ను, పిల్లల్ని బతకనివ్వండి: ఏడ్చిన పరిటాల సునీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha
హైదరాబాద్: ఇప్పటికే తన భర్త పరిటాల రవీంద్ర మృతి చెందారని, కనీసం తనను, తన పిల్లల్ని అయినా ప్రశాంతంగా బతకనివ్వాలని రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత శుక్రవారం కన్నీరు పెట్టుకున్నారు. అనుమతులు లేకుండా తన ఇంట్లో పోలీసులు అర్ధరాత్రి పూట సోదాలు నిర్వహించారని, దీనిపై తాను స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె టిడిపి ఎమ్మెల్యేలతో కలిసి ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో మీడియాతో మాట్లాడారు.

ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ఎలా సోదాలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎస్పీని అడిగితే ఎమ్మెల్యేని అయిన తనకు కూడా ఏమాత్రం స్పందించలేదన్నారు. తన అబ్బాయి పరిటాల శ్రీరామ్ కేసు వివరాలను కూడా ఆయన చెప్పలేదన్నారు. గతంలో ఇళ్లు సోదాలు చేసి రవిని చంపారని, మరి ఇప్పుడు సోదాలు చేసి తనను చంపుతారా లేక తన పిల్లల్ని ఏమైనా చేస్తారా అనే భయం కలుగుతోందన్నారు.

తమకు తమ పార్టీ నేతలు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నందు వల్ల ఇలా బతుకగల్గుతున్నామన్నారు. పరిటాల శ్రీరామ్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్పీకర్‌కు దీనిపై ఫిర్యాదు చేస్తే విచారించి 48 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. పరిటాల కుటుంబంతో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని స్వయంగా కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డియే చెప్పారని గుర్తు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎలా తనిఖీలే చేస్తారన్నారు.

అనంతపురం జిల్లా పోలీసులపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్‌ను కోరామన్నారు. మహిళా ఎమ్మెల్యే ఇంట్లో అర్ధరాత్రి సోదాలు ఎలా చేస్తారన్నారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. పోలీసులు నిబంధలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందించలేదని ఆరోపించారు.

English summary
TDP Raptadu MLA Paritala Sunitha has wept at media conference regarding her son Paritala Sriram issue on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X