జగన్ అవినీతిని నిరూపించే దమ్ముందా?: విజయమ్మ

జగన్ అవినీతిని నిరూపించే దమ్ము ఎవరికైనా ఉందా అని సవాల్ చేశారు. మెదక్ జిల్లా పటాన్చెరులో గురువారం విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపిపి అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడారు. వైయస్ జగన్ ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టిడిపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు.
తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా జగన్ ఏనాడు క్యాంప్ కార్యాలయంలోగాని, సచివాలయంలోగానీ వెళ్లలేదన్నారు. ఏ చిన్న పదవి కూడా జగన్కు లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్ర శూన్యమని తెలిసినా అన్యాయంగా కేసుల్లో ఇరికించారన్నారు. కాంగ్రెస్ను వీడిన రెండో రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. చంద్రబాబు మోసపూరిత పాదయాత్రలు చేస్తూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని విజయమ్మ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చలువే అన్నారు.
జగన్పై అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆయన చరిత్ర గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రహేజా, ఐఎంజీ, గోల్ఫ్కోర్టు, ఎమ్మార్ తదితర సంస్థలకు చేసిన భూసంతర్పణలో బాబు పెద్ద ఎత్తున వెనకేసుకున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం పేరుతో ఊదరకొట్టిన చిరంజీవి తన పార్టీని అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. 90 రోజుల్లో రావాల్సిన బెయిల్ను అడ్డుకుని 224రోజుల పాటు జగన్ను జైల్లో పెట్టడం అన్యాయమన్నారు.












Click it and Unblock the Notifications