వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫైర్: రెండేళ్ల పాపను కొట్టి ఫ్రిజ్‌లో పెట్టిన కసాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

East godavari map
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘాతుకం చేసుకుంది. తన సహజీవనం చేస్తున్న మహిళ రెండేళ్ల కూతురిని ఓ వ్యక్తి విపరీతంగా కొట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రాజమండ్రిలోని నారాయణపురంలోని వాంబే కాలనీలో జరిగింది. బాషా అనే వ్యక్తి రోహిణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

రోహిణి తన ఐదేళ్ల పాపను, రెండేళ్ల పాపను బాషాకు అప్పగించి, ప్రకాశం జిల్లా ఒంగోలుకు పని మీద వెళ్లింది. నెల రోజుల క్రితమే ఆమె వాంబే కాలనీలోని ఇంటికి వచ్చింది. రోహిణి తనకు అప్పగించిన పిల్లలను బాషా విపరీతంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఐదేళ్ల పాప బిందు బయటకు వచ్చి ఏడ్పు సాగించింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చారు. ఇంట్లో చూశారు.

మరో పాపను బాషా ఫ్రిజ్‌లో పెట్టిన విషయాన్ని వారు గుర్తించారు. రేఖ అనే ఆ పాపను బయటకు తీశారు. శరీరంపై వాతలు ఉన్నాయి. పాపను అతను కొరికినట్లుగా చెబుతున్నారు. దీంతో బాషాను చితకబాది ప్రకాష్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు పాపలను కూడా బాషా పైశాచికంగా హింసించాడు.

పాపను చంపే ఉద్దేశంతోనే బాషా విపరీతంగా కొట్టి ఫ్రిజ్‌లో పెట్టాడని ఆరోపిస్తున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారాన్ని రోహిణికి అందించేందుకు స్థానికులు ప్రయత్నాలు సాగించారు. బాషాపై పోలీసులు హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
A person beat his live in partner's 2 years old daughter and jept in fridge in Narayanapuram of Rajamundry in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X