అఫైర్: రెండేళ్ల పాపను కొట్టి ఫ్రిజ్లో పెట్టిన కసాయి
రోహిణి తన ఐదేళ్ల పాపను, రెండేళ్ల పాపను బాషాకు అప్పగించి, ప్రకాశం జిల్లా ఒంగోలుకు పని మీద వెళ్లింది. నెల రోజుల క్రితమే ఆమె వాంబే కాలనీలోని ఇంటికి వచ్చింది. రోహిణి తనకు అప్పగించిన పిల్లలను బాషా విపరీతంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ఐదేళ్ల పాప బిందు బయటకు వచ్చి ఏడ్పు సాగించింది. దీంతో ఇరుగుపొరుగు వచ్చారు. ఇంట్లో చూశారు.
మరో పాపను బాషా ఫ్రిజ్లో పెట్టిన విషయాన్ని వారు గుర్తించారు. రేఖ అనే ఆ పాపను బయటకు తీశారు. శరీరంపై వాతలు ఉన్నాయి. పాపను అతను కొరికినట్లుగా చెబుతున్నారు. దీంతో బాషాను చితకబాది ప్రకాష్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు పాపలను కూడా బాషా పైశాచికంగా హింసించాడు.
పాపను చంపే ఉద్దేశంతోనే బాషా విపరీతంగా కొట్టి ఫ్రిజ్లో పెట్టాడని ఆరోపిస్తున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారాన్ని రోహిణికి అందించేందుకు స్థానికులు ప్రయత్నాలు సాగించారు. బాషాపై పోలీసులు హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.