అదే చివరి మాట: పేరు చెప్పిన గ్యాంగ్ రేప్ విక్టిం తండ్రి
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో మృతి చెందిన నిర్భయ అసలు పేరును ఆమె తండ్రి వెల్లడించారు. తన కూతురు పేరు అందరికీ తెలియాలని ఆయన అన్నారు. తనకు బతకాలని ఉందని తన కూతురు చెప్పిందని, అవే ఆమె చివరి మాటలు అని ఆవేదనతో ఆమె తండ్రి చెప్పారు. కాగా తన తల్లితో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఉండగా మొదట చెప్పిన మాట కూడా అదే. అమ్మా తనకు బతకాలని ఉందని ఆమె చెప్పింది. బ్రిటన్ పత్రికకు అతను వెల్లడించారు. తన కుమార్తె పేరు ప్రపంచానికి తెలియాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. బాధిత మహిళల్లో స్థైర్యం నింపేందుకు అది పనికి వస్తుందన్నారు.
నిర్బయ, అనామికగా భారత్ పిలుచుకుంటున్న గ్యాంగ్ రేప్ బాధితురాలి పేరును ఆమె తండ్రి చెప్పారు. ఆమె పేరు ప్రపంచానికి తెలియాలని, తన కూతురు ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఆమెను చూసి తాము గర్విస్తున్నామన్నారు. ఆమె నిజమైన పేరును బయటపెట్టడం ద్వారా అత్యాచార, లైంగిక దాడులు ఎదుర్కొన్న మహిళల్లో ధైర్యం పెరుగుతుందని ఆకాంక్షించారు.
53 ఏళ్ల ఆ తండ్రి బ్రిటన్కు చెందిన 'ది సండే పీపుల్' పత్రికకు వివరాలు అందించారు. ఆ పత్రిక ఆదివారం కథనం ప్రచురించింది. తండ్రిని ఉత్తరప్రదేశ్లోని ఆయన స్వగ్రామంలో ఇంటర్వ్యూ చేసినట్లు మిర్రర్ గ్రూప్కు చెందిన ఈ వార పత్రిక పేర్కొంది. డిసెంబర్ 16 రాత్రి దారుణ అత్యాచారం తర్వాత, 28న ఆమె మరణించాక కూడా భారత మీడియా పేరు, ఇతర వివరాల వెల్లడిపై సంయమనం పాటించింది. అలాగే ప్రస్తుతం ఫాస్ట్ట్రాక్ కోర్టులో ఈ కేసు దర్యాప్తు బహిరంగంగా జరుగుతున్నా ఆ వివరాలను బహిర్గతం చేయరాదని ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు.

ఈ నేపథ్యంలో బ్రిటీష్ పత్రిక ఈ ఇంటర్వ్యూను ప్రచురించటం విశేషం. ఆ దుర్మార్గులు ఆరుగురికీ మరణ శిక్ష విధించిందన్న వార్త వినాలన్నదే తమ కోరిక అని, ఇటువంటి ఘోర దురంతాలు ఇకపై జరగకూడదని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ విమానాశ్రయంలో లోడర్గా పనిచేసే ఆయన, కుమార్తె విషాద జ్ఞాపకాలకు దూరంగా కుటుంబంతో స్వగ్రామం వెళ్లిపోయారు. డిసెంబర్ 16 నాటి దారుణం నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ... తాను మొదటిసారి ఆస్పత్రికి వెళ్లేసరికి తన బిడ్డ కళ్లు తెరవలేని నిస్సహాయ స్థితిలో మంచంమీద పడి ఉందని, తనను చూడగానే బాధ భరించలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుందన్నారు.
అంతా చక్కబడుతుందని ధైర్యం చెప్పానని కానీ, అమ్మతోపాటు అన్నయ్యలు చూడ్డానికి రాగా మరోసారి బాగా ఏడ్చిందని, అటుపైన తమాయించుకుని, తమకే ధైర్యం చెప్పడం తనను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసిందన్నారు. ఆమె తప్పక కోలుకుంటుందని, దుండగులకు మరణశిక్ష పడక తప్పదని అనిపించిందన్నారు. కూతురుపై దాడి జరిగినప్పుడు ఆమె వెంట ఉన్న వ్యక్తి స్నేహితుడే తప్ప బాయ్ ఫ్రెండ్ కాదని చెప్పారు. ఆమెను కాపాడేందుకు అతడెంతో ధైర్యంగా ప్రయత్నించాడని ప్రశంసించారు. వారికి వివాహం నిశ్చయమైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications