వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా మొరిగే కుక్క: ఢిల్లీ రేప్‌ వ్యాఖ్యలపై ఆశారాం

By Pratap
|
Google Oneindia TeluguNews

Asaram Bapu
న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంలో బాధితురాలు కూడా దోషి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు ఈసారి మీడియాపై పడ్డారు. మీడియాను మొరిగే కుక్కగా ఆయన అభివర్ణించారు. తాను ఏనుగులాంటివాడినని, మొరిగే కుక్కలకు (మీడియాకు) భయపడనని ఆయన అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంలో బాధితురాలిపై తాను చేసిన వ్యాఖ్యలపై మీడియా విరుచుకుపడడంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆయన మండిపడ్డారు. "మొదట ఒక కుక్క మొరిగింది, ఆ తర్వాత మరో కుక్క మొరిగింది. నేను ఏనుగు లాంటివాడిని. మొరిగే కుక్కలకు భయపడను" అని ఆయన అన్నారు. ఆశారామ్ బాపు వ్యాఖ్యలు నిర్హేహుతకంగా ఉన్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆశారామ్ మానసిక స్థితిని ఈ ఘటన బయటపెడుతోందని విమర్శించారు. బాపు స్థాయి వ్యక్తులు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని జ్యోతి సోదరుడు వ్యాఖ్యానించారు.

తమకు ఆశారామ్ అంటే చాలా గౌరవం ఉండేదని, ఆశారామ్ పుస్తకాలు చాలా తమ ఇంట్లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆపుస్తకాలను తగలపెడతానని ఆయన అన్నారు.. కాగా, వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన ఆశారామ్ బాపుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ లక్నోలోని ఓ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఒక్క చేతితో చప్పట్లు రావని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, గ్యాంగ్ రేప్ వ్యవహారంలో నిదితులది మాత్రమే కాకుండా బాధితురాలిది కూడా తప్పు ఉందని ఆయన అన్నారు. నిందితులు తాగి ఉన్నారని, సరస్వతి శ్లోకాలు చదుపుతూ గురు దీక్ష చేసి ఉంటే ఆ అమ్మాయి ఆ బస్సు ఎక్కి ఉండేది కాదని ఆయన అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.

English summary

 acing widespread criticism for his controversial remarks on the Delhi gang rape incident, spiritual guru Asaram Bapu went off the handle on Tuesday terming his critics ‘barking dogs.’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X