వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాన్ల తలలు నరికి..: పాక్ సైన్యం ఘాతుకం, ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pakistan kills 2 indian soldiers
న్యూఢిల్లీ: ఇండియన్ టెరిటోరీని దాటిన ఇద్దరు భారత సైనికులను పాకిస్తాన్ దారుణంగా చంపింది. మరో ఇద్దరు భారత సైనికులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఉదయం పొగ మంచు కమ్మేసింది. ఈ సమయంలో పాకిస్తాన్ సైనికులు చొరబడి గస్తీ బృందంపై దాడి చేశారు. లాన్స్ నాయక్‌లు హేమరాజ్, సుధాకర్ సింగ్‌లను పాక్ సైనికులు హతమార్చారు.

ఆ ఇద్దరు జవాన్ల తలలను నిర్ధాక్షిణ్యంగా నరికేశారు. దీనిని భారత సైన్యం ధ్రువీకరించింది. మరో ఇద్దరిని దారుణంగా గాయపర్చారు. వారి ఆయుధాలను కూడా పాకిస్తాన్ సైనికులు వెంట తీసుకు వెళ్లారు. నార్త్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పర్నాయక్ ఘటనస్థలాన్ని సందర్శించారు. అక్కడ ఓ మృతదేహం ముక్కలు చేసి ఉన్నట్లుగా గుర్తించారు. ఓ సైనికుడి తలను వారు వెంట తీసుకు వెళ్లారు.

పాకిస్తాన్ - భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన మరో దారుణ ఘటనలో ఇది ఒకటి. పాక్ దళాలు జమ్మూకు ఉత్తరాన 220 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తుందని తాము భావిస్తున్నామని రక్షణ శాఖ రాత్రి ప్రకటించింది. ఇది పాక్ ఆర్మీ మరో దుశ్చర్య అని భారత ఆర్మీ తన స్టేట్‌మెంట్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

దాడి చేయలేదు

భారత సైనికులపై తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని, అదంతా దుష్ప్రచారమేనని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. భారత సన్యం ప్రపంచం దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.

English summary

 Two Indian soldiers were killed and another two injured by Pakistani army troops who crossed into Indian territory along the Line of Control in Kashmir. The body of one of the jawans who was killed was mutilated, said sources. This is one of the worst violations of the nearly decade-long ceasefire between India and Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X