వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాం దిగ్భోయ్‌లో పేలుడు: ముగ్గురు పిల్లలు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Assam map
గౌహతి: అస్సాంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. అస్సాంలోని తిన్సుకియా జిల్లా దిగ్బోయ్‌లోని ప్రాథమిక పాఠశాల వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు పిల్లలు మరణించారు. పలువురు గాయపడ్డారు.

దిగ్భోయ్ పట్టణంలోని ఖర్జాన్ పూల్ ఏరియాలో జరిగిన ఈ పేలుడు కారణాలేమిటనేది తెలియదు. కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సైనిక, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని దిగ్భంధం చేశారు.

గాయపడిన పిల్లలను ఆస్పత్రులకు తరలించారు. మిలిటెంట్ సంస్థలు ఈ పేలుడుకు ఒడిగట్టి ఉండవచ్చుననే విషయాన్ని పోలీసులు తోసిపుచ్చడం లేదు. సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

పేలుడులో అక్కడికక్కడే ఓ పిల్లవాడు మరణించగా, గాయపడిన ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అస్సాం హోం కార్యదర్శి జిడి త్రిపాఠీ చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

English summary
Three children were killed and several others injured in an explosion near a primary school in upper Assam's Tinsukia district on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X