అస్సాం దిగ్భోయ్‌లో పేలుడు: ముగ్గురు పిల్లలు మృతి

Assam map
గౌహతి: అస్సాంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. అస్సాంలోని తిన్సుకియా జిల్లా దిగ్బోయ్‌లోని ప్రాథమిక పాఠశాల వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు పిల్లలు మరణించారు. పలువురు గాయపడ్డారు.

దిగ్భోయ్ పట్టణంలోని ఖర్జాన్ పూల్ ఏరియాలో జరిగిన ఈ పేలుడు కారణాలేమిటనేది తెలియదు. కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సైనిక, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని దిగ్భంధం చేశారు.

గాయపడిన పిల్లలను ఆస్పత్రులకు తరలించారు. మిలిటెంట్ సంస్థలు ఈ పేలుడుకు ఒడిగట్టి ఉండవచ్చుననే విషయాన్ని పోలీసులు తోసిపుచ్చడం లేదు. సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

పేలుడులో అక్కడికక్కడే ఓ పిల్లవాడు మరణించగా, గాయపడిన ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు అస్సాం హోం కార్యదర్శి జిడి త్రిపాఠీ చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడిని ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+