సిఎం ఎదుట మసాలాపాటలకు చిందేసిన అమ్మాయిలు

ఇలాంటి సమయంలో కళాశాల విద్యార్థినుల మసాలా పాటల హోరుతో పరిసరాలు హోరెత్తాయి. చెవులకు చిల్లులు పడేలా డిజె సౌండ్తో విద్యార్థినులు బాలీవుడ్ పాటలకు చిందేశారు. ఏక్ దో, తీన్..., ఛోలీ కే పిచే క్యా హై.. పాటలతో మైదానం వూగిపోయింది. అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, డిజిపిల సమక్షంలో ఇలాంటి పాటల పట్ల పలువురు పెదవి విరిచారు. ఇలాంటి అధికారిక కార్యక్రమంలో ఇలాంటి పాటలేంటని గొణుక్కున్నారు.
అయితే పలువురు దీని పట్ల రుసరుసలాడటాన్ని గుర్తించిన పలువురు అమ్మాయిలను నృత్యం ఆపాలంటూ సైగలు చేశారు. పలువురు అభ్యంతరాలను గుర్తించిన హైదరాబాద్ హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు తేజ్ దీప్ కౌర్.. సిడిలో టెక్నికల్ సమస్య వచ్చిందని.. దానిని సరిచేశాక కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి డ్యాన్సులు చేస్తున్న అమ్మాయిలను అక్కడ నుండి పంపించి వేశారు.