రాహుల్ దేశానికే ఐరన్లెగ్: మైసూరా, గుర్నాథ్కుఅండ
అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తెలంగాణ సమస్యను కేంద్రం పరిష్కరించాలని పార్టీ ప్లీనరీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ సమస్యపై మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ ఆడుతున్నది రాజకీయ డ్రామా అన్నారు. అలాగే.. రాజకీయంగా మిత్రులు కాని వారిపై అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఇందుకు మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.
ఏదో ఒక కారణంతో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరిన్ని రోజులు జైలులో ఉంచాలని ప్రభుత్వం, సిబిఐ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. జగన్కు బెయిల్ రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే విధ్వంసమే అన్న పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి వ్యాఖ్యల పైనా స్పందించారు.
గుర్నాథ రెడ్డి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించి, అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారని, అందులో తప్పేముందన్నారు. ఆయనపై ఏం చర్య తీసుకుంటామన్నారు. తెలంగాణపై ఇంతవరకూ వైఖరి చెప్పని అధికార కాంగ్రెస్ను వదిలి పెట్టి ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం చెబితే విరుచుకుపడటం ఎందుకన్నారు.