వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ దేశానికే ఐరన్‌లెగ్: మైసూరా, గుర్నాథ్‌కుఅండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mysoora Reddy
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశానికే ఐరన్ లెగ్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఎంవి మైసూరా రెడ్డి మంగళవారం అన్నారు. కాంగ్రెసు జాతీయ నాయకత్వం ఒక గ్రామ సర్పించి కంటే అధ్వాన్నంగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ ఎక్కడికెళ్లినా రాహుల్‌ది ఐరన్‌ లెగ్గే అయిందని, ఇప్పుడు ఆయన దేశానికి ఐరన్‌లెగ్ అవుతాడేమో అని మైసూరా ఎద్దేవా చేశారు.

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తెలంగాణ సమస్యను కేంద్రం పరిష్కరించాలని పార్టీ ప్లీనరీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ సమస్యపై మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్ ఆడుతున్నది రాజకీయ డ్రామా అన్నారు. అలాగే.. రాజకీయంగా మిత్రులు కాని వారిపై అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఇందుకు మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.

ఏదో ఒక కారణంతో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరిన్ని రోజులు జైలులో ఉంచాలని ప్రభుత్వం, సిబిఐ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే విధ్వంసమే అన్న పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ రెడ్డి వ్యాఖ్యల పైనా స్పందించారు.

గుర్నాథ రెడ్డి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించి, అంతిమంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారని, అందులో తప్పేముందన్నారు. ఆయనపై ఏం చర్య తీసుకుంటామన్నారు. తెలంగాణపై ఇంతవరకూ వైఖరి చెప్పని అధికార కాంగ్రెస్‌ను వదిలి పెట్టి ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం చెబితే విరుచుకుపడటం ఎందుకన్నారు.

English summary

 YSR Congress party leader Mysoora Reddy has blamed Rahul Gandhi is iron leg to india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X