విలీన కలకలం: యాష్కీ సవాల్కు తెరాస సై, లేదంటే..
వరంగల్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తామని కెసిఆర్ స్పష్టంగా హామీ ఇవ్వలేదనటంమధు యాష్కీ, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వ్యాఖ్యలు సరికావని ఆయన అబిప్రాయపడ్డారు. ఒకవేళ వారం దాటిందంటే తామే కేంద్రంపై పోరాడి తెలంగాణను సాధించుకుంటామన్నారు. తెలంగాణ కోసం తెరాస ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.
సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్, సీమాంధ్ర నేతలు, మంత్రులను ఏం చేసినా తక్కువేనని తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హైదరాబాదులో మండిపడ్డారు. తెలంగాణ విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వారికి సిగ్గు, శరం.. విలువలు, నీతినిజాయితీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది చనిపోయారని, ఇందుకు కారణమైన వారిని ఖూనీకోర్లు అనక ఏమనాలన్నారు.
కాంగ్రెస్లో తెరాసను విలీనం చేయాలని అడగటానికి సిగ్గుందా? కాంగ్రెస్ బలంగా ఉందని ఓ వైపు చెబుతూనే మరి విలీనం ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కెసిఆర్ భాష బాగా లేదంటున్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి వేషం బాగుందా? అన్నారు. 'జగ్గారెడ్డి దొంగలకు సద్దులు మోసే సన్నాసి అని మండిపడ్డారు. ఆయన ఆకు రౌడీకి ఎక్కువ, వీధి రౌడీకి తక్కువ అని తెరాస ఎద్దేవా చేసింది.