తెలంగాణకు మద్దతు: ప్రత్యేక విదర్బపై పవార్ గురి

నిజానికి, అత్యంత పాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు తెలంగాణకు, విదర్భకు సంబంధించినవే. ఈ రెండు ప్రాంతాల డిమాండ్లను పక్కన పెట్టి కేంద్రం మూడు రాష్ట్రాలను కొత్తగా ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని తూర్పు జిల్లా విదర్భ. మహారాష్ట్రలో వెనకబడిన ప్రాంతంగా కూడా దానికి గుర్తింపు ఉంది. విదర్భలోని పెద్ద నగరం నాగపూర్. విదర్భలోని ఎక్కువ మంది ప్రజలు మరాఠీ మాండలికం వహర్దీ మాట్లాడుతారు.
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే భావనకు గురైన విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తలెత్తుతోంది. మహారాష్ట్రలో దశాబ్దం పాటు 32 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, అందులో 70 శాతం ఆత్మహత్యలు 11 జిల్లాలతో కూడిన విదర్భలోనే జరిగాయి. అపారమైన ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అడవులు, పర్వత శ్రేణులతో ఈ ప్రాంతం నిండి ఉంటుంది.
తెలంగాణకు మాదిరిగానే విదర్భ దక్కన్ పీఠభూమిపై ఉంది. విదర్భలో అమరావతి, నాగపూర్ డివిజన్లు ఉన్నాయి. విదర్భలో పది లోకసభ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో 62 శాసనసభా స్థానాలున్నాయి. ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ గోండ్యా లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నాగపూర్ రాజధానిగా విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫజల్ అలీ కమిషన్ 1956లో సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రాంతమైన హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో విలీనం చేయకూడదని, ఒకవేళ విలీనం చేయాలనుకుంటే 1961 ఎన్నికల వరకు ఆగాలని, అప్పుడు హైదరాబాద్ శాసనసభలోని మూడింట రెండు వంతల శాసనసభ్యులు అంగీకరిస్తేనే విలీనం చేయాలని ఫజల్ అలీ కమిషన్ సూచించింది. ఫజల్ అలీ కమిషన్నే ఇప్పుడు మొదటి ఎస్సార్సీ అంటున్నారు. ఉనికిలో లేనిదాన్ని రెండో ఎస్సార్సీగా పిలుస్తున్నారు. అయితే, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సును పట్టించుకోకుండా కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర రాష్ట్రంలో విదర్బను విలీనం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులు తరుచుగా విదర్బను ప్రస్తావించడం పరిపాటిగానే ఉంటోంది. తెలంగాణతో పాటు ఏర్పాటు కావాల్సిన ప్రత్యేక రాష్ట్రంగా విదర్భను చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు తలెత్తుతాయని ఆంధ్రప్రదేశ్లోని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు. అది సహజం కూడా.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications