అరుణ హత్య కేసు: చంచల్గుడా జైలుకు శివకుమార్

నిరుడు డిసెంబర్ 31 తేదీన అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే శివకుమార్ మహారాష్ట్రకు పారిపోయాడు. అరుణ శివకుమార్ నివాసంలోనే మరణించింది. శివకుమార్ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన శివకుమార్ను పోలీసులు జనవరి 4వ తేదీన పూణే నుంచి రైలులో తీసుకుని వస్తుండగా అతను వేగంగా పరుగు తీస్తున్న రైలు నుంచి కిందికి దూకాడు.
రైలు నుంచి కిందికి దూకడంతో శివకుమార్ కుడి చేయి, ఎడమ కాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో అతని కాలును, చేతిని వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి అతను పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం కుదుట పడడంతో శివకుమార్ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రైలునుంచి దూక ఆత్యహత్యకు ప్రయత్నించినందుకు గాను అతనిపై పూణేలో కూడా కేసు నమోదైంది.
అరుణ హత్య కేసులో పోలీసులు ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణ శివకుమార్ నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications