గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రిని హత్య చేసిన తనయుడు: వివాహిత హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Murder
హైదరాబాద్: పనీ పాట లేక జులాయిగా తిరుగుతున్నావని మందలించినందుకు ఓ పుత్రుడు తన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కుప్కల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తండ్రిని బండరాయితో మోది హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని తగులబెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శంషాబాద్ మండలం పెద్ద తుప్రా శివారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. దుండగులు వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుకన్య (26) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే... సుకన్యకు అదే గ్రామానికి చెందిన దిడ్ల ఉదయ్ కుమార్‌తో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సుకన్య తన తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఎన్నారై ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

శుక్రవారం ఉదయం విధులకు వెళ్లిన సుకన్య రాత్రి వరకూ ఇంటికి రాలేదు. దాంతో ఆందోళనకు గురై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం కత్తితో గొంతు కోసి ఉన్న సుకన్య మృతదేహం గ్రామ పరిసరాల్లోని పంట పొలాల్లో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుకన్యను ఆమె భర్తనే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

English summary
In a tragic incident, a son killed his father in Nizamabad district. In another incident, a married woman has been murdered in guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X