షర్మిల, బ్రదర్ అనిల్లపై బిజెపి: టిడిపిపై పడ్డ జూపూడి

తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పావుగా మారినట్లుగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. టిడిపి ఇచ్చిన కాగితాలతో ప్రెస్ మీట్ పెట్టే ముందు సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన చూసుకోవాల్సి ఉండెనన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోమని జగన్ చెప్పడం ఆ పార్టీ నేతలకు రుచించక పోయి ఉండవచ్చునని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లౌకికవిధానం నచ్చకుంటే దానిపై పోరాడండని సూచించారు.
ప్రజా సమస్యల పైన పోరాడకుండా వైయస్ కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైయస్ కుటుంబంపై బిజెపి ఆరోపణలు ఆ పార్టీ పతనావస్థను సూచిస్తున్నాయని విమర్శించారు. షర్మిల పాదయాత్ర ప్రారంభమవుతున్న సమయంలో తమ నాయకులపై ఏదో రకంగా బురదజల్లే టిడిపి వ్యూహంలో ఆయన ఓ పావుగా ఉపయోగపడుతున్నారన్నారు. వైయస్ మృతి తర్వాత మూడున్నరేళ్లకు వారి కుటుంబ సభ్యులపై బిజెపి రాష్ట్ర నాయకుడు విచిత్ర ఆరోపణలు చేశారన్నారు.
తెలుగుదేశం, బాబును భుజానికెత్తుకున్న ఛానళ్లలో ఈ ప్రెస్ మీట్కు లభించిన ప్రాధాన్యం, ఎల్లో పత్రికల్లో సోమవారం ఈ వార్తలకు లభించే ప్రాధాన్యం టిడిపి - బిజెపిల బంధాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు తోడ్పడుతాయన్నారు. సిబిఐ కేసును కాంగ్రెసు - టిడిపిలు సంయుక్తంగా నడుపుతున్నాయని ఆరోపించారు. జగన్ పైన కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అని తాము అనడం లేదని, సుష్మనే చెప్పారన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications