తెలంగాణ కోసం మరో యువకుడి ఆత్మబలిదానం

Another suicide for Telangana
నల్గొండ: తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం రావడం లేదనే మనస్తాపంతో నల్గొండ జిల్లాలో మరో యువకుడు ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు . నల్గొండ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కట్ట సత్యం(29) శనివారం అర్ధరాత్రి గ్రామంలోని 60 అడుగుల ఎత్తుగల ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకాడు. రెండు కాళ్లు, నడుం విరిగి తీవ్రంగా గాయపడిన సత్యంను నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

సత్యం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలో 13 ఏళ్లుగా చురుకుగా పనిచేస్తున్నాడు. తెలంగాణ పాటలు పాడేవాడు. వృత్తి రీత్యా సుతార్ మేస్త్రి అయిన సత్యం ప్రస్తుతం బుద్ధారం తెరాస గ్రామశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మెడకు తెరాస కండువా కప్పుకొని బయటికి వెళ్లి ఓవర్‌హెడ్ ట్యాంకు ఎక్కాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పలువురికి ఫోన్‌ద్వారా తెలిపాడు.

జనవరి 28న తెలంగాణ ప్రకటన చేస్తారని ఆశించి, రాకపోవడతో మనస్తాపం చెంది తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి సోదరుడు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ రూరల్ ఎస్ఐ బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్పత్రిలో సత్యం మృత దేహాన్ని పలువురు తెరాస నాయకులు సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతదేహంతో క్లాక్‌టవర్ సెంటర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+