నా బలమెంతో చెప్తా: తమ్ముడి కోసం జెసి లాబీయింగ్

ఈ సందర్భాలలో ఆయన మాట్లాడారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పారు. జిల్లాలో తన బలమెంతో తర్వాత చెబుతానని అన్నారు. తన సోదరుడి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. జిల్లా రాజకీయాలపై తాను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రితో చర్చించానని చెప్పారు. తన సోదరుడి డిసిసిబి అభ్యర్థిత్వం రేసులో ఉన్నారని చెప్పారు.
తనకు జిల్లాలో సన్నిహితులు, స్నేహితులు చాలామంది ఉన్నారన్నారు. పొత్తులు, మద్దతు వ్యవహారంపై చూడవచ్చునని అన్నారు. ఆ తర్వాత ఆయన జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు తిప్పే స్వామి, శివరామిరెడ్డి తదితరులను కలిశారు. తన సోదరుడికి అండగా నిలువాలని వారిని జెసి కోరినట్లుగా సమాచారం.
పార్టీ చెప్పినట్లు నడుచుకుంటా
డిసిసిబి అధ్యక్షుడి ఎంపిక పైన అధిష్టానం చెప్పినట్లుగా తాను నడుకుంటానని విప్ శివ రామి రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications