ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అనుమానాస్పద మృతి

Candidate of MLC elections dead
ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అవలదాసు దుర్గాప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో టీవీ చూస్తూ ఫోన్‌లో ఎవరితోనూ మాట్లాడుతూ అలాగే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు.

ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని కుర్చీ నుంచి ఎంతకీ లేవకపోవడంతో భార్య దుర్గాప్రసాద్‌ను కదిలించింది. దాంతో అతనిలో కదలిక లేకుండా పోయింది. అప్పటికే అతను మరణించారు. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గా ప్రసాద్ చివరగా ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుర్గాప్రసాద్‌ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తేల్చారు.

దుర్గాప్రసాద్ మంచి ఆరోగ్యంతో ఉండేవారని, గుండెపోటుతో మరణించడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక యధావిధిగా జరుగుతుందని సంబంధిత అధికారులు ప్రకటించారు.

ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తూ ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓ అభ్యర్థి తరఫున వారు సెల్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. యువకుల నుంచి పెద్ద యెత్తున సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+