కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాస్టల్లో ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl commits suicide in hostel
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్లారెడ్డిగుడాలో సోమవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని సోమవారం ఎల్లారెడ్డిగుడాలోని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలిని 23 ఏళ్ల స్రవంతిరెడ్డిగా గుర్తించారు. ఆమె కడప జిల్లాకు చెందిన అమ్మాయి. ఎల్లారెడ్డిగుడాలోని సాయికృప నిలయం అనే వుమెన్స్ హాస్టల్లో రెండేళ్లుగా ఉంటున్న స్రవంతిరెడ్డి సోమవారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.

ఆమె ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. హాస్టల్‌లోని ఇతర అమ్మాయిలు ఉరేసుకుని కనిపించిన స్రవంతి రెడ్డిని చూసి హాస్టల్ యజమానులకు విషయం తెలిపారు. వెంటనే పంజగుట్ట పోలీసులు హాస్టల్‌కు వచ్చారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారని హాస్టల్ యజమాని శ్రీనివాస్ చెప్పాడు.

స్రవంతి రెడ్డి రాసి పెట్టిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

 An engineering graduate committed suicide by hanging at her hostel in Yellareddyguda on Monday. The victim was identified as Sravanti Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X