గాలి హవాలా: కర్ణాటకలో మరో ఐదు కేసులు నమోదు
ఈ కేసులు నమోదు కావడంతో బెంగళూరు సిబిఐ కోర్టు వారికి పీటీ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 23న హాజరు పరచాల్సిందిగా చంచల్గూడ జైలు అధికారులను బెంగళూరు సిబిఐ కోర్టు ఆదేశించింది. ఇనుప ఖనిజం ఎగుమతి ద్వారా ఆర్జించిన సొమ్మును గాలి జనార్దన్ రెడ్డి హవాలా మార్గంలో దేశంలోకి తరలించాడని, దాన్నే రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాడని ఆరోపణలు మోపింది.
ముంబై కేంద్రంగా గాలి జనార్దన్ రెడ్డి హవాలా వ్యవహారం నడిపినట్లు సిబిఐ గుర్తించింది. తన వ్యూహంలో భాగంగా గాలి జనార్డన్ రెడ్డి చైనా, సింగపూర్, దుబాయ్ల్లో మారు పేర్లతో కొన్ని దిగుమతి కార్యాలయాలు ఏర్పాటు చేశాడని, విటి ద్వారా ఖనిజం ఎగుమతి ఆర్డర్లు తెప్పించాడని సిబిఐ ఆరోపిస్తోంది.
కాగా బెయిల్ కోరుతూ ఓఎంసీ కేసులో నిందితుడు గాలి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు 22కు వాయిదా వేసింది. ఇదే కేసులో మరో నిందితుడు అలీఖాన్ బెయిల్ పిటిషన్పై డిఫెన్స్ న్యాయవాది వాదనలు ముగిశాయి. సిబిఐ వాదనలు వినేందుకు కేసును కోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది.