వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్ కేటాయింపు: కిరణ్ రెడ్డికి సింధియా షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jyotiraditya Scindia - Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని కేంద్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను కలిశారని, రాష్ట్రానికి అదనపు గ్యాస్ ఇవ్వాలని కోరారని ఆయన చెప్పారు.

అయితే గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని ఆయన తేల్చేశారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సింధియా ఈ సందర్భంగా సూచించారు.

గుజరాత్ - ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధియా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వగలమని సింథియా చెప్పారు. కాగా ఇటీవల ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి అదనపు గ్యాస్ సరఫరాపై ఇప్పటికే కేంద్రనికి లేఖ రాసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో తీవ్రమైన విద్యుచ్ఛక్తి కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నుంచి అదనపు గ్యాస్‌ను రాబట్టుకుని సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో అదనపు గ్యాస్ కేటాయింపు కోసం ఆయన కేంద్రానికి లేఖ రాశారు.

English summary
The union power minister Jyotiraditya Scindia has rejected Andhra Pradesh CM Kiran kumar Reddy's appeal to allocate additional gas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X