బాత్రూంలో రహస్య కెమెరా పెట్టి, కంప్యూటర్లో చూస్తూ..
కెమెరాను అమర్చిన ఎలక్ట్రీషియన్ను రఘునాథ్గా గుర్తించారు. బాత్రూంలోని ఛాయాచిత్రాలను తీయడానికి హీటర్ ఆల్టో మీటర్ బాక్స్ లోపల మీనియేచర్ కెమెరాను అతను అమర్చాడు. కెమెరాకు చిన్నపాటి రేడియో ఎవి ట్రాన్స్మిటర్ను తగిలించాడు.
ఆ ట్రాన్స్మిటర్ బాత్రూంలోని కెమెరా తీసిన ఫొటోలను ఎలక్ట్రీషియన్ నివాసంలోని కంప్యూటర్కు అనుసంధానం చేసిన రిసీవర్ స్వీకరిస్తుంది. అ రకంగా అతను గత ఎనిమిది నెలలుగా ఎలక్ట్రీషియన్ గుట్టు చప్పుడు కాకుండా పొరుగింటి బాత్రూంలోని ఫొటోలను చూస్తున్నాడు. సైబర్ ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం పోలీసులు కంప్యూటర్ హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు.
పొరుగింటిలో ఇద్దరు వివాహిత స్త్రీలు ఉంటున్నారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లు. వారి భర్తలు విదేశాల్లో పనిచేస్తున్నారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కెమెరాను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
తాను వాటర్ హీటర్స్ను ఏర్పాటు చేసిన ఇతర ఇళ్లలో కూడా ఆ ఎలక్ట్రీషియన్ ఇటువంటి కెమెరాలను పెట్టాడా అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు.