పేలుళ్లు: దర్యాఫ్తు సంస్థల్ని తప్పుపట్టిన అహ్మద్బుఖారి
హైదరాబాద్ పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్లు తమకు దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోందంటూ ఎన్ఐఎ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. పేలుళ్లలో ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. అధికార ప్రకటనలకు, ఆధారాలకు పొంతన లేదని, మాలేగావ్, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్ప్రెస్ ఘటనల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం అమాయక ముస్లిములను అరెస్టు చేసిందని ఆయన విమర్శించారు.
కాగా, ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ధౌలా కౌన్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు మోటార్ సైకిల్పై వచ్చి ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి సమీపంలో ఒక ల్యాప్టాప్ బ్యాగ్ను వదిలిపెట్టారని పోలీసులకు ఫోన్ రావడం, వెంటనే పోలీసులు అప్రమత్తమై బాంబుల జాడను పసిగట్టే శునకాలతో పాటు సైన్యంలోని బాంబు నిర్వీర్య దళాలు కూడా వెంటనే రంగంలోకి దిగి పరిశీలించిన విషయం తెలిసిందే.
బాంబు నిర్వీర్య దళం కూడా అక్కడకు చేరుకొని సాయంత్రం 5.20 గంటల సమయంలో బ్యాగ్ను ధ్వంసం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలతో పాటు ఢిల్లీ పోలీసులోని ప్రత్యేక విభాగానికి కూడా సమాచారం అందించగా వారు కూడా వెనువెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే, ఆ బ్యాగ్లో పేలుడు పదార్థాలు ఉన్నాయో లేవో శునకాలు తేల్చలేకపోయాయి. బ్యాగ్ను తెరిచేందుకు సైన్యం చిన్నస్థాయిలో పేలుడు జరపాల్సి వచ్చింది. బ్యాగులో కొన్ని ఇటుకలు, ల్యాప్టాప్ వైర్లు కనిపించాయి.