సడక్ బంద్: సస్పెన్షన్ కోసం తెరాస ఎమ్మెల్యేల వ్యూహం

అలా తమపై వేటు వేయించుకొని సడక్ బంద్ కార్యక్రమానికి హాజరు కావాలని చూస్తోందట. గత బుధవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగాన్ని తెరాస సభ్యులు అడ్డుకున్నారు. గురువారం, శనివారం ఇతర విపక్షాలూ వివిధ అంశాలపై ఆందోళనకు దిగినా, ప్రధానంగా తెలంగాణపై తెరాస పట్టువల్లే సభ వాయిదా పడింది. సోమవారం కూడా అలాగే బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారట.
అలా అడ్డుకుంటే కనీసం నాలుగు రోజుల వరకు సస్పెండ్ చేయొచ్చు. ఆ సమయాన్ని ఈ నెల 21న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన సడక్ బంద్ కోసం వినియోగించుకోవాలని తెరాస ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఒకవేళ సస్పెన్షన్ ఒకరోజే ఉంటే దాన్ని నిరసిస్తూ మరో మూడు రోజులు (19వ తేదీ సభకు సెలవు) సమావేశాలను బహిష్కరించాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందట.












Click it and Unblock the Notifications