అమ్మాయిలపై అసభ్య వ్యాఖ్యలు: పట్టించిన ఫేస్బుక్
రెండు గంటల్లోనే దీనిపై పదిహేనువేల మంది నెటిజన్లు స్పందించారు. పలువురు ప్రముఖులు అమ్మాయిలకు న్యాయం చేయాలంటూ పిలుపులిచ్చారు. దీంతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి రెండు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
38 ఏళ్ల మహిళపై దాష్టీకం
ఓ ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై ఎనిమిదేళ్ల వివాహిత సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో చోటు చేసుకుంది. మహిళపై బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలియజేశారు.
శుక్రవారం తన భర్తతో గొడవపడిన సదరు మహిళ ఆ తర్వాత దేవాస్ వద్ద బస్సు ఎక్కింది. బస్సు ఇండోర్కు చేరుకునేసరికి ఆమె తప్ప మిగిలిన ప్రయాణీకులు అందరూ దిగిపోయారు. దీంతో ఒంటరిగా ఉన్న ఆ మహిళపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో డ్రైవర్ జహీద్, కండక్టర్ లాలా, మరో వ్యక్తి రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.