వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలపై అసభ్య వ్యాఖ్యలు: పట్టించిన ఫేస్‌బుక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bangalore police arrested two men
బెంగళూరు/భోపాల్: అమ్మాయిలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న ఇద్దరు అబ్బాయిల ఫొటోలు ఫేస్‌బుక్‌లో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు వారిని పట్టుకోగలిగారు. ఇద్దరు అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అక్షయ్ కింగర్, అజయ్ భాస్కర్ అనే ఇద్దరు యువకులు ఫొటో తీసి ఈ నెల 8న ఫేస్‌బుక్‌లో పెట్టారు.

రెండు గంటల్లోనే దీనిపై పదిహేనువేల మంది నెటిజన్లు స్పందించారు. పలువురు ప్రముఖులు అమ్మాయిలకు న్యాయం చేయాలంటూ పిలుపులిచ్చారు. దీంతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి రెండు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

38 ఏళ్ల మహిళపై దాష్టీకం

ఓ ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై ఎనిమిదేళ్ల వివాహిత సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‍‌‌లో చోటు చేసుకుంది. మహిళపై బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలియజేశారు.

శుక్రవారం తన భర్తతో గొడవపడిన సదరు మహిళ ఆ తర్వాత దేవాస్ వద్ద బస్సు ఎక్కింది. బస్సు ఇండోర్‌కు చేరుకునేసరికి ఆమె తప్ప మిగిలిన ప్రయాణీకులు అందరూ దిగిపోయారు. దీంతో ఒంటరిగా ఉన్న ఆ మహిళపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో డ్రైవర్ జహీద్, కండక్టర్ లాలా, మరో వ్యక్తి రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Two youth were arrested by Bangalore police for abusing two girls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X