అత్యాచారం... పెళ్లి పేరుతో మోసం: వ్యక్తికి పదేళ్ల జైలు
ఈ విషయమై కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నిందితుడు.. అరుణ్ కుమార్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డట్లు విచారణలో రుజువైందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి చెప్పారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం అరుణ్ కుమార్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు.
మరదలిపై బావ దాష్టీకం
తాగి అత్తవారింటికి వచ్చిన అల్లుడు మరదలిపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రాజు అనే వ్యక్తి ఆదివారం అత్తగారింటికి వచ్చాడు. భార్య బంధువుల ఇంటికి వెళ్లడంతో రాత్రి అక్కడే ఉన్నాడు. అత్తమామలు నిద్రిస్తున్న సమయంలో మరదలిపై అత్యాచారం చేసి చంపేశాడు.
ఆ తర్వాత పని ఉందని చెప్పి ఇంటి నుండి పారిపోయాడు. ఉదయం బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోయినట్లు గుర్తించారు. అల్లుడి నిర్వాకం వల్లే చనిపోయిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.