గొట్టిపాటికి జగన్ ఝలక్!: అద్దంపై హామీ ఉందన్న నేత

ఈ రోజు హైదరాబాదులో గరటయ్య మాట్లాడుతూ.. అద్దంకి సీటు పైన వైయస్ జగన్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. గొట్టిపాటి రవి కుమార్ పార్టీలో చేరారు కదా, ఆయన కూడా అదే సీటు కోసం అడుగుతున్నారు కదా అని ప్రశ్నిస్తే... గొట్టిపాటి ఎక్కడి నుండి పోటీ చేస్తారో తనకు తెలియదని, తనకు మాత్రం జగన్ నుండి అద్దంకి టిక్కెట్ పైన స్పష్టమైన హామీ లభించిందని చెబుతున్నారు.
మరోవైపు, దాదాపు నెల రోజుల క్రితం జగన్తో జైల్లో భేటీ అయిన గొట్టిపాటి ఆ తర్వాత మాట్లాడుతూ తనకు జగన్ అద్దంకి సీటుపై హామీ ఇచ్చారని చెప్పారు. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు. అద్దంకి టిక్కెట్ పైన తనకు జగన్ హామీ ఇచ్చారని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్ను అన్యాయంగా, కుట్రపూరితంగా అవినీతి కేసులో ఇరికించి జైలులో పెట్టించారని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. తనకు జగన్ టిక్కెట్ పైన హామీ ఇచ్చారన్నారు. ఆయన చెప్పిన తర్వాత అద్దంకి గొడవ హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి కూడా చేరుకున్న విషయం తెలిసిందే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications