టిడిపిలో కయ్యం: దూళిఫాళ్ల వర్సెస్ కొత్తకోట దయాకర్

ఆ సంఘటన గురువారం శానససభలో జరిగింది. కోపంతో తన చేతిలో ఉన్న పత్రాలను కొత్తకోట దయాకర్ రెడ్డి విసిరికొట్టారు. విద్యుత్ సమస్యపై తక్షణం చర్చ చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టిడిపిఎల్పీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడారు. దీంతో కొత్తకోట విభేదించారు. తాగునీటి సమస్యకు తొలి ప్రాధాన్యం ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన నరేంద్రతో వాదించారు. తన మాటను నరేంద్ర పట్టించుకోలేదని పేపర్లు విసిరికొట్టారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి అభినందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న తుమ్మల ప్రసంగానికి ఆ ప్రశంసలు దక్కాయి 'పార్టీ వాణిని బాగా వినిపించావు. నీ ప్రసంగం చాలా బాగుంది. హృదయాన్ని తాకేలా మా ట్లాడావు. అభినందనలు' అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అద్దంకి సీటుకు అభ్యర్థి ఎంపిక వ్యవహారం వేడి పుట్టించడంతో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గరటయ్య గురువారం ఇక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయనను మీడియా ప్రతినిధులతో అద్దంకి సీటు వ్యవహారం గురించి కదిపినప్పుడు తనకు ఆ సీటుపై పార్టీ నుంచి హామీ ఉందని గరటయ్య చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications