ఢోకా లేదు, సంజయ్ దత్కి క్షమాభిక్ష పెడితే..: చిరంజీవి

విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం పట్ల చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్లు, రిసార్టులలో మహిళలపై లైంగిక దాడుల ప్రభావం టూరిస్టుల పైన పడుతోందని చిరు అభిప్రాయపడ్డారు. విదేశీ మహిళా పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ విషయమై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యానని, పర్యాటకులకు రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పారు.
విదేశీ పర్యాటకుల రక్షణ కోసం తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులతో భేటీ అవుతామన్నారు. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో కేంద్రం పర్యాటక శాఖకు ఎక్కువ నిధులను కేటాయించిందని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ కోసం నిధులు కోరుతామన్నారు. చిరంజీవి షిండేతోను ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతోను భేటీ అయ్యారు.
కాగా, కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో స్విస్ వనితపై గ్యాంగ్ రేప్ ఉదంతంపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరు విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన మచ్చగా మారినట్లు ఆయన భావించారు.
సంజయ్ దత్కి క్షమాభిక్ష పెడితే సంతోషిస్తా
బాలీవుడ్ హీరో సంజయ్ దత్కి క్షమాభిక్ష పెడితే మంచిదేనని చిరంజీవి అన్నారు. ఆయనకు క్షమాభిక్ష పెడితే తాను సంతోషిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు అంతిమమైనా తాను క్షమాభిక్ష పెట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications