సంజయ్ దత్కి క్షమాభిక్ష ప్రసాదించండి: కట్జూ విజ్ఞప్తి
ఈ మేరకు ఆయనను దోషిగా నిర్ధారించలేదన్నారు. అయినా, ఆయన ఇప్పటికే చాలా మనోవ్యథకు గురయ్యారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలని గవర్నర్ను కట్జూ కోరారు. లైసెన్స్ లేకుండా కేవలం అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులోనే సంజయ్ దత్కు శిక్ష పడిన విషయాన్ని మార్కండేయ కట్జూ గుర్తు చేశారు. పేలుళ్లతో సంబంధం లేనందున సంజయ్ దత్కు క్షమాభిక్ష పెట్టే అవకాశం గవర్నర్ లేదా రాష్ట్రపతికి ఉందని ఆయన అన్నారు.
క్షమాభిక్ష చట్టం 161 కింద గవర్నర్ లేదా రాష్ట్రపతి క్షమాభిక్షను పెట్టవచ్చునని చెప్పారు. ఇప్పటికే సంజయ్ దత్ పదహారు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ దత్ జైలు జీవితాన్ని తగ్గించేందుకు గవర్నర్ చొరవ తీసుకోవచ్చునని చెప్పారు. గతంలో ఓ మర్డర్ కేసులో నిందితుడికి గవర్నర్ క్షమాభిక్ష పెట్టిన సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సంజయ్ దత్కు పేలుళ్లతో సంబంధం లేదని, అతను కేవలం అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకే సుప్రీం కోర్టు శిక్షను విధించిందన్నారు. మర్డర్ కేసు క్షమాభిక్ష కంటే ఇది అంతకంటే పెద్దదేమీ కాదని కట్జూ అభిప్రాయపడ్డారు. మర్డర్ కేసులో ఓ గవర్నర్ క్షమాభిక్ష పెట్టినప్పుడు ప్రస్తుతం గవర్నర్ సంజయ్ దత్కి క్షమాభిక్ష పెడతారని తాను ఆశిస్తున్నానని అన్నారు.