ఢిల్లీలోని అక్బరు రోడ్డులో చిరంజీవికి అధికారిక గృహం!
ఇప్పుడు ఓ అధికారిక నివాసం ఇవ్వనున్నారు. దీంతో పార్లమెంటు అధికారులు ఆయనకు అక్బర్ రోడ్డులోని పదిహేడవ నెంబర్ బంగళాను కేటాయించారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు కీలక భూమిక పోషించిన సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఈ ఇంట్లో పదిహేడేళ్లు నివసించారు. ఇప్పుడు చిరంజీవికి అది కేటాయించడంతో మరమ్మతులు చేపట్టారు.
మన చారిత్రక సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి చిరంజీవి శనివారం అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో రాత్రి ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.
మన సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, ఆహారం, నృత్యాలు తదితర ప్రతి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. ఇందుకోసం ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ ఆర్ట్ ఫెస్టివెల్ రీతిలో దక్షిణాదిన జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు రెట్టింపు స్థాయిలో నిధులు సమకూర్చేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.