హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుక్క కన్నా హీనంగా చచ్చిపోయాడు: వైయస్‌పై సర్వే

By Pratap
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్రమైన వ్యాఖ్య చేశాడు. ప్రజా సేవ చేయాలని చెప్పి వైయస్ రాజశేఖర రెడ్డిని సోనియా గాంధీ ముఖ్యమంత్రిని చేసిందని, అయితే వైయస్ ప్రజా ధనాన్ని దోచుకుని పాపపు పనులు చేశాడని, అందుకే కుక్క కంటే హీనంగా చనిపోయాడని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాదులోని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. వైయస్, ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డి కొల్లగొట్టిన ప్రజాధనం, అక్రమాలను చూస్తుంటే అసలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌లో పుట్టడం దురదృష్టకరమని భావిస్తున్నానని సర్వే అన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క పథకం ఘనత వైయస్‌ది కాదని, అది సోనియా, కాంగ్రెస్ పార్టీ ఘనత మాత్రమేనని చెప్పారు. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాలతో వైయస్ రాజశేఖరెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని, కానీ ఐదు దశాబ్దాల్లో కాంగ్రెస్‌లో ఏ ఒక్క నేత సంపాదించుకోలేనంత డబ్బును ఐదేళ్లలోనే ఆయన దోచుకున్నారని, దోచుకోవడానికి ఇప్పుడు జగన్ తహతహలాడుతున్నారని ధ్వజమెత్తారు.

జైలు ఊచలు లెక్కబెడుతున్న జగన్ గజదొంగ అని, ఆయన పాపపు పనుల్లో, అవినీతి సొమ్ములో భాగం పంచుకున్న ఆలీబాబా వంటి వారంతా ఆయన పార్టీలోకి వెళుతున్నారని విమర్శించారు.

English summary
Making a wild comment on YS Rajasekhar Reddy the union minister Satyanarayana said that the former has dead like dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X