వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు పాలనలో భేష్: టిడిపి ఎమ్మెల్యేలకు నాగం క్లాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు విద్యుత్తు సరఫరా సక్రమంగా జరిగిందని, ఈ విషయాన్ని ఆ పార్టీ శాసనసభ్యులు శానససభలో సరిగా చెప్పలేకపోయారని తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఆయన టిడిపి శాసనసభ్యులకు క్లాస్ తీసుకున్నారు.

తన పాలనలో తెలుగుదేశం పార్టీ విద్యుత్‌రంగాన్ని చాలా బాగా నిర్వహించిందని, కాని సభలో జరిగిన చర్చలో దానిని సరిగ్గా చెప్పుకోలేకపోయిందని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాగం జనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు. 'ఒక్క తెలంగాణ విషయంలోనే నేను పార్టీతో విభేదించా. మంచి జరిగి ఉంటే చెప్పడానికి నాకు ఇబ్బందేమీ లేదు" అని ఆయన అన్నారు.

"విద్యుత్ రంగంలో టిడిపి చాలా బాగా చేసింది. ఆ రోజు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా. రైతులు గడియారం చూసుకొని పొలం వెళ్ళే స్థాయిలో కరెంటు ఇచ్చింది. ఎంత కరువు ఉన్నా రైతులకు ఇబ్బంది రానీయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా నాశనం అయింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా బాగా దాడి చేసి ఉండాల్సింది.' అని నాగం అన్నారు.

తన రాజకీయ ప్రస్థానంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, ఏ పార్టీలో చేరేది తగిన సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబుతో విభేదించి నాగం జనార్దన్ రెడ్డి బయటకు వచ్చి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు.

English summary
Telangana Nagara Samithi leader Nagam Janardhan Reddy has praised the power supply situation in the Telugudesam party president Nara Chandrababu Naidu's administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X