తేల్చండి: కోమటిరెడ్డి సోదరులకు జగన్ పార్టీ అల్టిమేటం!

పార్టీలోకి వస్తారో లేదో? వారం రోజుల్లోగా తేల్చాలని ఆదేశాలు జారీ చేశారట. అయితే, వారు మాత్రం మరికొద్ది నెలలు గడువు కోరారట. అక్టోబర్ లేదా నవంబరు వరకు పార్టీలోకి వస్తామని చెప్పారట. ఈలోగా తెలంగాణపై అనుకూల నిర్ణయం వెలువడితే, ఇప్పుడున్న పార్టీలోనే ఉంటామని కూడా జగన్ పార్టీకి చెప్పారట. కాంగ్రెసు తెలంగాణపై నిర్ణయం తీసుకోని పక్షంలో పార్టీలోకి వస్తామని చెప్పారట.
కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తేల్చని పక్షంలో సమైక్య రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో చేరవచ్చునని వారు భావిస్తున్నారట. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సోమవారం హైదరాబాద్లో భేటీ అవుతోంది. విద్యుత్ చార్జీల పెంపు, ఇతర అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం జరుగుతున్నట్లు పార్టీ కార్యాలయం ఆదివారం తెలిపింది.
మరోవైపు.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తల గోల చెలరేగడంతో వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పెండింగులో పెట్టారు. సమన్వయకర్తలు ప్రకటించిన చోటల్లా అసంతృప్తి రాజుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications