చావ్లా తర్వాత ఆందోళన, వెంట భగవద్గీత: విలియమ్స్
తన వెంట శ్రీమద్భగవద్గీత, ఉపనిషత్తులను ఉంచుకున్నానని ఆమె చెప్పారు. ఎంతగానో మద్దతునిచ్చే తన కుటుంబ సభ్యులు తనకు ఉన్నారని, ఇది తన అదృష్టమన్నారు. తన కుటుంబం సహకారంతోనే వ్యోమగామినయ్యానన్నారు. మరోసారి తాను అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కల్పనా చావ్లా మృతి తర్వాత తాను స్పేస్లోకి వెళ్లేందుకు తొలుత కొంత ఆందోళనకు గురయ్యానని చెప్పారు.
అంతరిక్షంలో తాను ఎంతో ఉత్కంఠగా గడిపానని చెప్పారు. స్పేస్లో ఉన్నన్నాళ్లు తన ఇంట్లోనే ఉన్నట్లుగా అనిపించిందన్నారు. స్పేస్ చాలా అద్భుతమైనదన్నారు. విద్యార్థులు తాము ఏది ఇష్టపడతారో అదే చిత్తశుద్ధితో చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.
స్పేస్లో యాభై గంటల నలభై నిమిషాలు వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునిత చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా 322 రోజులు స్పెస్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రికార్డులు అనేవి బ్రేక్ చేయడానికే ఉన్నాయని, యంగ్ జనరేషన్కు అవకాశమిస్తే రికార్డులు బ్రేక్ చేస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. కాగా, సునిత ఏప్రిల్ 3, 4 తేదీల్లో ముంబయిలో ఉంటారు. ఆ తర్వాత తన తండ్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ వెళ్లనున్నారు. సునిత 2007 అక్టోబర్లో చివరిసారి భారత్లో పర్యటించారు.