మెదక్ వదలను, కెసిఆర్తోనైనా చర్చకి సై: రాములమ్మ

దీనిపై ఆమె స్పందిస్తూ మెదక్ను వదులుకోనని చెప్పారట. "ఎన్నికలకు ముందు పార్టీలోకి ఐఏఎస్లో.. ఐపీఎస్లో.. పారిశ్రామికవేత్తలో వస్తే.. వారికోసం నా సీటును త్యాగం చేయాలా?'' అని ఆమె ప్రశ్నించారట. పార్టీ కోసం అందరి కంటే ఎక్కువగా తాను కష్టపడుతున్నానని చెప్పిన ఆమె "మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి బయటికంటే కొంత భిన్నంగా ఉంటుందని చెప్పారు.
ఇది ఉద్యమాలు జరిగిన ప్రాంతం. అదే సమయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు.. అణచివేతకు ప్రతీకలు. అలాంటిది ఒక ఉద్యమ పార్టీలోకి ఎవరు పడితే వాళ్లు వస్తే.. వారి కోసం సీటు ఖాళీ చేసేదిలేద''ని తేల్చి చెప్పారట. ఒకవేళ కెసిఆరే అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటే ఆయనతో చర్చిస్తానని కూడా రాములమ్మ తేల్చి చెప్పారట.
"గత ఎన్నికల్లోనూ కెసిఆర్, నేనూ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పార్టీలో కొంత తర్జన భర్జన జరిగింది. తమతోపాటు సీనియర్లు అందరూ కూర్చొని చర్చించాకే కెసిఆర్ మహబూబ్నగర్ నుం చి, నేను మెదక్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడూ అలాగే జరుగుతుందని ఆమె వివరించారట.












Click it and Unblock the Notifications